మోదీకి శుభాకాంక్షలు తెలియజేసిన వైఎస్ జగన్..!!

ఆదివారం రాష్ట్రపతి భవన్ లో మోదీ( Narendra Modi ) మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుండి ప్రముఖులు సినీ నటులు హాజరయ్యారు.

 Ys Jagan Congratulated Modi For Becoming The Prime Minister For The Third Time M-TeluguStop.com

ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలు కూడా హాజరు కావడం జరిగింది.తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) హాజరయ్యారు.

విదేశాల నుండి భూటాన్ పీఎం షేరింగ్ తోబ్‌గే, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మొహమ్మద్ మొయిజ్జు, శ్రీలంక అధ్యక్షుడు విక్రం సింఘే హాజరయ్యారు.

బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్, మణిపూర్ సీఎం బీరెన్ సింగ్, ఉత్తరాఖండ్ సీఎం దామీ, మండి ఎంపీ కంగనా రనౌత్, బీహార్ సీఎం నితీశ్ కుమార్, సూపర్ స్టార్ రజనీకాంత్, సీజేఐ చంద్రచూడ్ తదితరులు పాల్గొన్నారు.ఇదిలా ఉంటే వైసీపీ అధినేత వైఎస్ జగన్ ( YS Jagan )మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన మోదీకి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేశారు.“భారత్ ప్రధానిగా వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ నరేంద్ర మోదీ గారికి నా హృదయపూర్వక అభినందనలు” అని పోస్ట్ పెట్టడం జరిగింది.వైయస్ జగన్ పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇదిలా ఉంటే ఈసారి మోదీ క్యాబినెట్ లో రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఐదుగురికి చోటు దక్కింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube