మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా ఇవాళ సీబీఐ విచారణకు వైఎస్ అవినాశ్ తండ్రి భాస్కర్ రెడ్డి హాజరయ్యారు.
కడప సెంట్రల్ జైల్ గెస్ట్ హౌస్ లె వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ విచారిస్తుంది.భాస్కర్ రెడ్డి విచారణ నేపథ్యంలో జైలు వద్దకు కార్యకర్తలు భారీగా చేరుకున్నారు.
దీంతో పోలీసులు కడప సెంట్రల్ జైలు దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.







