ఒకప్పుడు తెలుగులో లవ్ సినిమాలతో బాగా హడావుడి చేసిన బ్యూటీ అనిత.బాలీవుడ్ ఇండస్ట్రీ కి చెందిన ఈమె గతంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటించింది.
కెరీర్ మొదట్లో అనిత మోడల్ గా చేయగా ఆ తర్వాత నటనపై ఆసక్తి ఉండటంతో నటిగా అడుగు పెట్టింది.ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది.
2001 తేజ దర్శకత్వంలో వచ్చిన నువ్వు నేను సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది.ఈ సినిమాలో తన నటనకు మంచి పేరు సంపాదించుకుంది.
ఇక ఈ సినిమా కూడా మంచి హిట్ సొంతం చేసుకుంది.కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ, కన్నడ భాషలలో కూడా నటించింది.
కేవలం సినిమాలలో కాకుండా సీరియల్స్ లలో కూడా చేసింది.తన నటనకు పలు అవార్డులు కూడా సొంతం చేసుకుంది.
ఇక నువ్వు నేను సినిమా తర్వాత తెలుగులో శ్రీరామ్, నిన్నే ఇష్టపడ్డాను, నేను పెళ్లికి రెడీ వంటి పలు సినిమాలలో నటించింది.ఆ తర్వాత బాలీవుడ్ కు 2003లో కుచ్ తో హై అనే సినిమాతో పరిచయమైంది.
ఇక ఈ సినిమా తర్వాత బాలీవుడ్ లో తనకు మంచి అవకాశాలు వచ్చాయి.ఇక సీరియల్ లో నెగటివ్ రోల్ లో కూడా చేసింది.

ఈమెకు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా మంచి అభిమానం ఉంది.ఒక మంచి హోదాలో ఉన్న సమయంలో ఆమె 2013లో ప్రముఖ వ్యాపారవేత రోహిత్ రెడ్డిని గోవాలో పెళ్లి చేసుకుంది.వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంది ఈ బ్యూటీ.

సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.ఈ వయసులో కూడా తను మంచి ఫిజిక్ తో ఉంది.బాగా వర్క్ అవుట్ లు చేస్తూ కష్టపడుతూ కనిపిస్తుంది.సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూనే ఉంటుంది.తన భర్తతో ఫన్నీ ఫన్నీ వీడియోస్ చేస్తూ తన ఫాలోవర్స్ కు పంచుకుంటుంది.అప్పుడప్పుడు ఫ్రెండ్స్ తో కలిసి దిగిన ఫోటోలను కూడా బాగా షేర్ చేస్తూ ఉంటుంది.

ఇక పూర్తిగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటూ అక్కడే సెటిల్ అయిపోయింది.ఇక తెలుగు ప్రేక్షకులకు సోషల్ మీడియా ద్వారా టచ్ లో ఉంది.ఇదంతా పక్కన పెడితే తాజాగా తను ఒక స్టోరీ పంచుకుంది.అందులో తను బీర్ తాగుతున్నట్లు కనిపించింది.బీర్ తో బాగా చిల్ అవుతున్నాను అన్నట్లు పంచుకుంది.ఇక మరో స్టోరీలో.
గ్లాస్ బీర్ ఫినిష్ చేసే వరకు ఆగలేను అంటూ తెలిపింది.అంతేకాకుండా నేను ముసలిదానినయ్యానా.
ఏమైంది నాకు అంటూ ఏడుస్తూన్న ఎమోజీలు పెట్టి పంచుకుంది.ప్రస్తుతం ఆ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.







