MP Vijayasai Reddy : త్వరలో వైసీపీ మ్యానిఫెస్టో ప్రకటన..: ఎంపీ విజయసాయి రెడ్డి

ఏపీలో వైసీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘సిద్ధం’ సభలకు( Siddham Meeting ) ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని ఆ పార్టీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి( MP Vijayasai Reddy ) అన్నారు.ఈ క్రమంలోనే వచ్చే నెల 10వ తేదీన మేదరమెట్లలో సిద్ధం సభ జరగనుందని తెలిపారు.

 Ycp Manifesto Announcement Soon Mp Vijayasai Reddy-TeluguStop.com

ఈ సభకు సుమారు 15 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.ఈ మేరకు దాదాపు 98 ఎకరాల ప్రాంగణంలో సభను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

ఈ సభా వేదికపై నుంచి ప్రభుత్వ పథకాలు, ప్రజాపాలనపై సీఎం జగన్( CM Jagan ) వివరిస్తారని చెప్పారు.ఈ క్రమంలోనే ఏప్రిల్ రెండో వారంలో ఎన్నికలు ఉండొచ్చన్నారు.వైసీపీ మ్యానిఫెస్టోను( YCP Manifesto ) అతి త్వరలోనే విడుదల చేస్తామన్న విజయసాయిరెడ్డి సిద్ధం సభలోపే అన్ని సీట్లను ప్రకటిస్తామని పేర్కొన్నారు.ఎవరెన్ని పొత్తులు పెట్టుకున్నా ప్రజలు తమవైపే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube