ఏపీ ఎన్నికల ప్రధానాధికారిని కలిసిన వైసీపీ నేతలు..!

ఏపీ ఎన్నికల ప్రధాన అధికారిని వైసీపీ నేతలు కలిశారు.

ఈ మేరకు సీఈవో ముఖేశ్ కుమార్ మీనాతో మంత్రులు జోగి రమేశ్, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణతో పాటు వైసీపీ నేతలు సమావేశం అయ్యారని తెలుస్తోంది.

తెలంగాణలో ఓటు వేసిన వారు ఏపీలో ఓటు వేయకుండా చర్యలు తీసుకోవాలని సీఈవోకు మంత్రులు ఫిర్యాదు చేశారు.అలాగే ఓటర్ల జాబితా అవకతవకలతో పాటు టీడీపీ నేతల అక్రమాలపై కంప్లైంట్ చేశారని తెలుస్తోంది.

అయితే గత కొన్ని రోజులుగా బోగస్ ఓట్లపై వైసీపీ, టీడీపీ మధ్య వార్ నడుస్తోన్న సంగతి తెలిసిందే.

ఆ విషయంలో ప్రభాస్, నాని గ్రేట్ అంటున్న అభిమానులు.. అసలేమైందంటే?
Advertisement

తాజా వార్తలు