తెలంగాణ రాష్ట్రం( Telangana State ) ఏర్పడిన నాటి నుంచి నేటి వరకూ ఎందరో ప్రజా ప్రతినిధులు,అధికారులు రావడం పరిశీలించి పోవడమే కానీ,తొమ్మిదేళ్లు అయినా ఇంత వరకు ఆ డ్రైనేజీ పనులకు అతీగతీ లేదని చౌటుప్పల్ పట్టణ ప్రజలు వాపోతున్నారు.యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్( Yadadri Bhuvanagiri Choutuppal ) మున్సిపల్ పరిధిలోని 14వ వార్డులో నెలకొన్న డ్రైనేజీ సమస్యకు పరిష్కారం ఉందా లేదా అర్దంకాక పట్టణ ప్రజలు అయోమయంలో పడ్డారు.
గతంలో పని చేసిన ఎమ్మెల్యేలు,స్థానిక ప్రజా ప్రతినిధులు,అధికారులు ఈ డ్రైనేజీ దగ్గరకు రావడం చూసిపోవడం ఓ తంతుగా మారింది తప్ప ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదంటే పట్టణ ప్రజలపై ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
ఎన్నికల సమయంలో వివిధ పార్టీల అభ్యర్థులు ఇస్తున్న హామీలు డ్రైనేజీ( Drainage Problems )లో కలిసి పోతున్నాయని,ప్రస్తుత మునుగోడు తాజా ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీ కూడా నీటి మీద రాతలుగానే మిగిలిపోయాయనిఅవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి ఏడాది సంబంధిత అధికారులతో 14వ వార్డులో పర్యటిస్తూ హామీలు ఇస్తున్నారే తప్పా ఎటువంటి పనులు చేపట్టడం లేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.త్వరలోనే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇప్పటికైనా ఈ డ్రైనేజీ సమస్య పరిష్కారమవుతుందా లేదా అని పట్టణ ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు.