షియోమీ నుండి 74 ఇంచెస్ స్మార్ట్ టీవీ..!

ఇండియాలో షియోమీ ఫోన్లకు ఉన్న డిమాండ్ గురించి అందరికి తెలిసిందే.ఎం.

ఐ ఫోన్ల అమ్మకాలు మన దేశంలో షియోమీకి ఎక్కువ లాభాలు తెచ్చి పెడుతున్నాయి.

అయితే ఇప్పుడు ఇదే తరహాలో షియోమీ నుండి స్మార్ట్ టీవీలను రిలీజ్ చేస్తున్నారు.2020 లో షియోమీ 55 ఇంచెస్ టీవీ రిలీజైంది.ఇప్పుడు ఆ 55 అంగుళాల టీవీ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ తో ఈసారి 74 ఇంచెస్ టీవీ రిలీజ్ అవుతుంది.

ఈ స్మార్ట్ టీవీ ఏప్రిల్ 23న ఆన్ లైన్ లో రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తుంది.షియోమీ నుండి రాబోతున్న ఈ సరికొత్త స్మార్ట్ టీవీ ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి.

ఏప్రిల్ 23న షియోమీ టీవీతో పాటుగా ఎం.ఐ 11 ఎక్స్ సీరీస్ స్మార్ట్ ఫోన్ కూడా లాంచ్ చేస్తున్నారు.ఎం.ఐ క్యూ.ఎల్.ఈ.డీ టీవీ 4కె 74 అంగుళాలతో అతి పెద్ద స్క్రీన్ తో వస్తుంది.టీవీలో సినిమా చూస్తే థియేటర్ లో చూస్తున్న ఫీలింగ్ వస్తుంది.

Advertisement

అయితే టీవీ ధర అధికారికంగా చెప్పలేదు.అయితే ఇతర కంపెనీల్లో ఈ ఫీచర్స్ తో టీవీ రావాలంటే కనీసం 1,50,000 రూపాయలు పెట్టాల్సి ఉంటుంది.

అయితే షియోమీ ఎంత ప్రైస్ ఫిక్స్ చేస్తుంది అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఈ టీవీలు కూడా క్లిక్ అయితే ఫోన్లతో పాటుగా టీవీలతో కూడా షియోమీ ఇండియన్ మార్కెట్ పై పట్టు సాధిస్తుందని చెప్పొచ్చు.

Advertisement

తాజా వార్తలు