వావ్.. రెబల్ స్టార్ల ఫోజు అదిరిందిగా..?

టాలీవుడ్ పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ గురించి బాలీవుడ్ వరకు అందరికీ తెలిసిందే.ప్రభాస్ కు ఉన్న రేంజ్, ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.

పాన్ ఇండియా స్టోరీ లో నటిస్తూ పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు.ప్రభాస్ కు బాహుబలి తర్వాత మరింత క్రేజ్ పెరిగింది.

వరుస సినిమాలతో బిజీగా ఉంటూ బాలీవుడ్ భామ లతో నటిస్తున్నాడు.ఇక ప్రభాస్ పెద్ద నాన్న కృష్ణంరాజు గురించి అందరికి తెలిసిందే.

ప్రభాస్, కృష్ణం రాజు కాంబినేషన్ లో సినిమా వస్తే చాలు.అభిమానులంతా వాళ్ల సినిమాలకు ఎగబడుతుంటారు.

Advertisement

ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు మంచి విజయాన్ని సాధించినవే.ఇదిలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న రాధేశ్యామ్ సినిమా లో నటిస్తున్నాడు.

ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక కృష్ణంరాజు తాజాగా తన ట్విట్టర్ లో ఓ ఫోటో షేర్ చేయగా ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.ఈ ఫోటోలో కృష్ణంరాజు, ప్రభాస్ ఫోటోకు ఫోజు ఇస్తూ కనిపించారు.ప్రభాస్ తో కలిసి 1970 కాలాన్ని గుర్తు చేస్తా.

జులై 30న రాధేశ్యామ్ తో ఆ కాలంలోకి తిరిగి వెళదాం " అని కృష్ణంరాజు ట్వీట్ చేయగా.ఈ ఫోటోను, ట్విట్ ను చూసిన నేటి జనులు.

ఇదేందయ్యా ఇది.. కట్టెల పొయ్యిపై రొట్టెలు చేస్తున్న హీరోయిన్..
ఓకే డ్రెస్ ను చాలాసార్లు రిపీటెడ్ గా ధరించిన సెలబ్రిటీస్ వీరే !

కృష్ణం రాజు రాధేశ్యామ్ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడని అర్థమవుతుంది.మొత్తానికి ఈ సినిమా విడుదలకు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Advertisement

ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ కు వరుస ఆఫర్లు ఉండగా నాగ్ అశ్విన్ దర్శకత్వం లో ఓ ప్రాజెక్టు చేయనున్నాడు.అంతే కాకుండా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాలో నటిస్తున్నాడు.

అంతే కాకుండా బాలీవుడ్ స్టార్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ అనే సినిమాలో నటించనున్నాడు.మరో బాలీవుడ్ స్టార్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తో ఓ సినిమా కు ఓకే అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

తాజా వార్తలు