బెంగుళూరు లో దారుణ ఘటన,మహిళా కండక్టర్ పై యాసిడ్ దాడి

ఇటీవల హైదరాబాద్ లోని షాద్ నగర్ లో చోటుచేసుకున్న దిశ ఘటన నిందితులు ఎంకౌంటర్ లో మృతి చెందినప్పటికీ మహిళల పట్ల అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు.దిశ ఘటన తరువాత ఎన్ని చట్టాలను తీసుకువచ్చి మహిళలపై చోటుచేసుకునే దారుణాలను ఆపాలని చూస్తున్నప్పటికీ కిరాతకులు మాత్రం ఏమాత్రం ఆగడం లేదు.

 Woman Bus Conductor-TeluguStop.com

మొన్నటికి మొన్న దిశ ఘటన తరువాత, వరుసగా తెలంగాణా లోనే చాలా ఘటనలు చోటుచేసుకున్నాయి.అయితే తాజాగా కర్ణాటక లో కూడా ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది.

ఒక మహిళా బస్సు కండక్టర్ (35) పై గుర్తు తెలియని దుండగులు యాసిడ్ దాడి చేశారు.బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పోరేషన్(BMTC)లో కండక్టర్‌గా పనిచేస్తున్న బాధితురాలు తూముకూరు జిల్లాకు చెందిన ఇందిరా బైరిగా గుర్తించారు.

ప్రస్తుతం బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు.

ఘటనపై బెంగళూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదవ్వగా ఈ ఘటనకు సంబందించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఏదైనా పాత కక్షల నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుందా,లేదా మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube