తల్లిదండ్రులను , అన్నను పోగొట్టుకొని కృష్ణ ఒంటరి వాడు అయ్యాడు అంటూ మూడు నాలుగు రోజులుగా మీడియా చాల హడావిడి చేషుతుంది.కానీ తెలుగు సినిమ పరిశ్రమకు మూలపురుషుల్లో ఒకరిగా ఉన్న కృష్ణ కు చాల అన్యాయం చేసారు అంటూ ఒక వర్గం ప్రేక్షకుల తో పాటు కృష్ణ అభిమానులు చాల బాధపడుతున్నారు.
తండ్రి పైన మహేష్ బాబు కు చాల ప్రేమ, గౌరవం ఉన్నాయనడం లో ఎటువంటి సందేహం లేదు.కానీ ప్రతి ఒక్క కృష్ణ అభిమాని కొన్ని విషయాలను తెలుసుకోవాలని అనుకుంటున్నాడు.
అవేంటో ఒకసారి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
కృష్ణ కు, అయన కుటుంబానికి ముఖ్యంగా మహేష్ బాబు కి హైదరాబాద్ లో చాల స్థలాలు, భూములు, స్టూడియో లు వైగారా ఆస్తులు ఉన్నాయ్.
అయినా కూడా ఒక వైపు చిన్న ఆదిశేష గిరి రావు, వదిన అమృత, తోబుట్టువులు మరియు మిగతా కుటుంబ సభ్యులు చెపుతున్నప్పటికీ మహేష్ బాబు వినకుండా మహా ప్రష్ఠానం లో అంత్యక్రియలు చేయడానికి పట్టు పట్టారని తెలుసుతుంది.కారణం ఏంటో మహేష్ బాబు చెప్తే అందరు వినాలని అనుకుంటున్నారు.
తన ఇంటి సభ్యుడు అయినా నరేష్ విజయ నిర్మల కోసం ఏకంగా కాంస్య విగ్రహం కట్టుకున్నది మనం చూస్తూనే ఉన్నాం.అలాంటిది సొంత తండ్రి కోసం ఒక ఎకరా స్థలం కూడా మహేష్ కేటాయించకపోవడం విడ్డురం గా ఉంది.
ఇక కృష్ణ కు గత 50 ఏళ్లుగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు.ఆయన్ను చూడటానికి అనే జిల్లాల నుంచి వారంతా తరలి వచ్చారు.కనీసం వారి కోసం అయినా చివరి చూపు చూపించడానికి గుచ్చి బౌలి స్టేడియానికి కృష్ణ ను తరలించి కాసేపు సందర్శన కోసం పెట్టి ఉండాల్సింది.అది జరగలేదు.ఇక కృష్ణ అంతిమ యాత్ర కోసం ఓపెన్ టాప్ వెహికిల్ ని కూడా ఉపయోగించలేదు.ఆలా అయినా ఆయన్ను అందరు చూసుకునే వారు.
మహేష్ బాబు ఇన్ని గందర గోల నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారో అంతు చిక్కడం లేదు.ఇక ఇప్పుడు మెమోరియల్ అనే విషయం వినిపిస్తుంది.
ఏదైనా ఎంత వరకు ఉంటుందో వేచి చూడాలి.