టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ శ్రీకారంమరికొద్ది గంటల్లో రిలీజ్కు రెడీ అయ్యింది.దర్శకుడు కిషోర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ పక్కా విలేజ్ బ్యాక్డ్రాప్ కథతో శర్వానంద్ అదిరిపోయే హిట్ అందుకోవాలని కసిగా ప్రయత్నిస్తున్నాడు.
ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్లు, ట్రైలర్లు, సాంగ్స్ ఇప్పటికే జనాలను అమితంగా ఆకట్టుకున్నాయి.ఈ సినిమాపై మరింత బజ్ను తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ హేమాహేమీలతో ప్రమోషన్స్ కూడా నిర్వహించింది.
అయితే ఈ సినిమా ప్రమోషన్స్ ఈ రేంజ్లో జరుగుతుండటంతో ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని చిత్ర యూనిట్ ధీమాగా ఉన్నారు.కానీ.ఒకవేళ కథ అడ్డం తిరిగితే పరిస్థితి ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.అంతంత మాత్రమే మార్కె్ట్ ఉన్న శర్వానంద్ ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటాడో పక్కనబెడితే, ఈ సినిమా కంటెంట్ యూత్, మాస్ ఆడియెన్స్కు కనెక్ట్ కాకపోతే పరిస్థితి ఏమిటి? కేవలం ఫ్యామిలీ ఆడియెన్స్తోనే ఈ సినిమా కమర్షియల్ హిట్ కావడం అసాధ్యం అని చిత్ర విశ్లేషకులు అంటున్నారు.మరి నిజంగానే అన్ని వర్గాల ప్రేక్షకులను ఇంప్రెస్ చేసే కథ ఈ సినిమాలో ఉందా లేదా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
ఏదేమైనా శ్రీకారం చిత్రంతో శర్వా ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థిత ఏర్పడటంతో శ్రీకారం చిత్రంపై మిశ్రమ అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక ఈ సినిమాలో ప్రియాంకా ఆరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తోండటంతో ఈ సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉండబోతుందా అనే అంచనాలు కూడా ప్రేక్షకుల్లో నెలకొన్నాయి.ఇప్పటికే ఈ సినిమా పాటలు ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ కావడంతో ఈ సినిమా కూడా సక్సెస్ కావాలని శర్వా అభిమానులు కోరుతున్నారు.
మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర మెప్పిస్తుందో మరికాసేపట్లో తేలిపోతుంది.