బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.
ఈ క్రమంలోనే రాధాకృష్ణ దర్శకత్వంలో పూజా హెగ్డే ప్రభాస్ జంటగా తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్.
ఈ సినిమా నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేసుకుని సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది.ఈ క్రమంలోనే ఉత్తరాది రాష్ట్రాలలో కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమా జనవరి 7వ తేదీ విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది.
అదేవిధంగా జనవరి 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా గురించి ఏ విధమైనటువంటి క్లారిటీ ఇవ్వలేదు.రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమా కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని పెద్దఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని భాషలలో ఒకేసారి విడుదల కావాల్సి ఉండగా కరోనా వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.ఇదిలా ఉండగా ప్రభాస్ నటించిన ఈ సినిమాకు ప్రముఖ ఓటీటీ సమస్థ భారీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే నెట్ఫ్లిక్స్ ఈ సినిమా కోసం 300 కోట్ల రూపాయలను ఆఫర్ చేయగా తాజాగా అమెజాన్ ప్రైమ్ ఏకంగా 350 కోట్లను ఆఫర్ చేసినట్లు సమాచారం.అయితే ప్రస్తుతం కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో సినిమాను థియేటర్లలో విడుదల చేసే అవకాశాలు కనిపించడం లేదు.దీంతో ఈ సినిమా పరిస్థితులు సద్దుమణిగిన తరువాత విడుదల చేస్తారా లేకపోతే ఈ సినిమాను థియేటర్లో కాకుండా ఓటీటీలో విడుదల చేస్తారా అనే సందిగ్ధంలో ఉన్నారు.
ఒకవేళ ఈ సినిమా కనుక ఓటీటీలో విడుదల అయితే ప్రభాస్ ఓటీటీ కి కూడా స్టార్ హీరోగా మారిపోతారనడంలో ఎలాంటి సందేహం లేదు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002[email protected]Ph No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy