పార్వతీపురం మన్యం జిల్లాలో వన్య మృగాల సంచారం తీవ్ర కలకలం రేపుతోంది.జిల్లాలో ఓ వైపు ఏనుగులు.
మరోవైపు పెద్దపులుల సంచారిస్తుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.వన్య మృగాలు సంచారం, దాడులతో ప్రజలు కంటి మీద కునుకులేకుండా జీవనం సాగిస్తున్నారు.
ఓ పక్క పంట పొలాలను ఏనుగుల గుంపులు నాశనం చేస్తుండగా పెద్దపులులు పశువులపై దాడులకు పాలపడుతున్నాయి.గత ఐదు సంవత్సరాలుగా ఏనుగులు సంచరిస్తున్నట్లు సమాచారం.
గజరాజుల దాడులు పలు పంట పొలాలు ధ్వంసం కావడంతో పాటు పలువురు ప్రాణాలను సైతం కోల్పోయిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు పులి జాడ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.