భర్త షాపింగ్ కు తీసుకెళ్లలేదని భార్య ఏం చేసిందంటే..!

భార్య భర్తల అనుబంధం అంటే వాళ్ళిద్దరి మధ్య ఏకాభిప్రాయాలు ఉండటం.ఒకరినొకరు అర్థం చేసుకోవడం లేదా సర్దుకుపోవడం.

వివాహ జీవితమంటే చివరిదాకా మనస్పర్ధలు రాకుండా ప్రతి ఒక్క విషయం ను పంచుకుంటూ ఉండాలి.అంతేకానీ చీటికిమాటికి చిన్న పిల్లల్లా అల్లర్లు చేసుకుంటూ, అల్లర్ల పాలవుతూ.

గోరంతను కొండంత చేసుకుంటున్నారు నేటి దంపతులు.ఇలాగే ఓ భార్య తన భర్త తో కోరిన కోరిక తీర్చనందుకు.

ప్రాణాల వరకు తెచ్చుకున్న ఘటన చోటు చేసుకుంది.హైదరాబాద్ లో జవహర్ నగర్ లో నివాసముంటున్న నాగేశ్వరరావు, నాగమణి దంపతులు.

Advertisement

వీళ్ళకి 5 ఏళ్ళ, 8 నెలల పిల్లలు ఉన్నారు.కాగా తన భర్తను శనివారం రోజున షాపింగ్ కు తీసుకెళ్ళమని కోరింది.

కానీ నాగేశ్వరరావు తన మాటను నిరాకరించాడు.దీంతో ఇద్దరి మధ్య చిన్న గొడవ కాస్త పెద్దదిగా మారింది.

వెంటనే ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న ‌‌ఆ భార్య భర్త మీద కోపంతో తన పిల్లలతో సహా ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోయింది.

తిరిగి ఇంటికి ఎంతకు రాలేకపోయినా భార్య పిల్లల ను పలుచోట్ల వెతికినా నాగేశ్వరరావుకు వాళ్ల వివరాలు దొరకక పొయేసరికి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.పోలీసులు కేసు నమోదు చేసుకొని వెతుకుతున్న సమయంలో చెన్నాపూర్ చెరువులో మూడు మృతదేహాలు దొరికాయని అక్కడి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.దీంతో వెంటనే వెళ్లిన పోలీసులు ఆ మృత దేహాలను పరిశీలించగా నాగేశ్వర రావు భార్య, ఇద్దరు పిల్లలు అని తెలుసుకున్నారు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

వెంటనే మృతదేహాలను పోస్టుమార్టం కు తరలించారు.ఓ చిన్న గొడవ ప్రాణాల మీదకు వచ్చింది.ఓపికతో ఉండలేని ఆ భార్య చివరకు తన కోపమే తనకు, తన పిల్లల ప్రాణాల మీదకు తీసుకొచ్చింది.

Advertisement

తాజా వార్తలు