సుశాంత్‌ మృత దేహానికి రియా సారీ ఎందుకు చెప్పినట్లు?

సుశాంత్‌ మృతికి కారణం రియా చక్రవర్తి అంటూ ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో రోజు రోజుకు ఆమె మరింత ఇరుక్కుంటూనే ఉంది.

ఆమె బీహార్‌ పోలీసుల విచారణకు హాజరు కాకుండా దాదాపు వారం రోజుల పాటు అండర్‌ గ్రౌండ్‌కు వెళ్లి పోయిన విషయం తెల్సిందే.

ఆ తర్వాత ఆమె ఈడీ ముందు విచారణకు హాజరు అయ్యింది.త్వరలో ఆమెను సీబీఐ ప్రశ్నించే అవకాశం ఉంది.

ఈ సమయంలో ఆమె గురించి మరింత అనుమానం కలిగించేలా సుర్జీత్‌ సింగ్‌ రాథోర్‌ వ్యాఖ్యలు ఉన్నాయి.సుశాంత్‌ మృతి చెందిన తర్వాత ముంబయిలోని కూపర్‌ ఆసుపత్రి మార్చురీకి తరలించడం జరిగింది.

ఆ సమయంలో రియా చక్రవర్తి సోదరుడితో అక్కడకు వెళ్లిందట.మార్చురీలోకి వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నించింది.

Advertisement

సిబ్బంది కన్ను గప్పి మార్చురీ వద్దకు వెళ్లిందట.అయితే అక్కడ సెక్యూరీటి వాళ్లు ఆమెను లోనికి వెళ్లనివ్వలేదు.

బతిమిలాడి కన్నీరు పెట్టుకోగా ఆమె ఒక్కదాన్ని లోనికి పంపించారు.ఆ సమయంలో ఆమెకు సుశాంత్‌ మృత దేహంను సుర్జీత్‌ సింగ్‌ రాథోర్‌ చూపించాడట.

సుశాంత్‌ డెడ్‌ బాడీపై తాను క్లాత్‌ తీసి చూపించగా ఆమె కన్నీరు పెట్టుకుంది.చేతితో టచ్‌ చేసి సారీ బాబు అంటూ బోరున విలపించసాగింది.ఆ సమయంలో ఆమె చాలా బాధ పడ్డట్లుగా తప్పు చేసిన ఫీలింగ్‌తో కనిపించింది.

ఆమె బోరున ఏడుస్తుండటంతో నేను అక్కడ నుండి ఆమెను తీసుకు వెళ్లాను అంటూ సుర్జీత్‌ సింగ్‌ ఒక జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.పోలీసులు, సీబీఐ వారికి కూడా ఈ విషయాన్ని చెప్తానని అంటున్నాడు.

జూనియర్ ఎన్టీఆర్ పేరు బాలయ్యకు నచ్చదా.. తన తండ్రి పేరు దక్కడం బాలయ్యకు ఇష్టం లేదా?
Advertisement

తాజా వార్తలు