ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో రూపుదిద్దుకుంటున్న సినిమాలు అన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కించాలని అని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.చాలా మంది హీరోలు వారి సినిమాలను పాన్ ఇండియా సినిమాలుగా విడుదల చేయాలని ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.
స్టార్ హీరోల నుంచి చిన్న చిన్న హీరోలు వరకు పాన్ ఇండియా డ్రీమ్ ని ఫుల్ ఫిల్ చేసుకోవాలని ఆరాటపడుతున్నారు.ఇకపోతే ప్రస్తుతం హీరోలందరూ కూడా అదే తరహాలోనే ఆలోచిస్తున్నారు.
కానీ టాలీవుడ్ లో ఒక హీరో అలాంటి ప్రయత్నాలేవీ చేయకపోగా సైలెంట్ ని సస్పెన్స్ ని మెయింటైన్ చేస్తుండటం ఆసక్తికరంగా మారింది.
టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ మాత్రం సినిమాల విషయంలో ఇప్పటికీ సైలెంట్ ని సస్పెన్స్ ని మెయింటైన్ చేస్తుండటం ఆసక్తికరంగా మారింది.2019లో ఎబిసీడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు శిరీష్ కు ఆ సినిమా ఆశించిన విధంగా ఫలితాలను రాబట్ట లేకపోయింది.దాంతో కొత్తకథతో రావాలని రాకేష్ శశి డైరెక్షన్ లో ఓ ప్రేమకథని చేస్తున్నాడు అల్లు శిరీష్.
ఇక ఆ సినిమాకు ప్రేమ కాదంట అనే టైటిల్ ని ఖరారు చేసినట్లి ప్రకటించిన విషయం తెలిసిందే.ఇందులో హీరో అల్లు శిరీష్ సరసన అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న విషయం తెలిసిందే.ఇందుకు సంబందించిన ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ ని కూడా విడుదల చేశారు.ఇక అప్పటి నుంచి ఇంత వరకు ఈ సినిమాకి సంబంధించిన ఎలాంటి అప్ డేట్ లేదు.అయితే ఈ సినిమాతో పాటు మొదలైన చాలా చిన్న సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకోవడమే కాకుండా థియేటర్లలోకి ఓటీటీ లో సందడి సందడి చేస్తున్నాయి.
అయినా కూడా ఈ సినిమాకి సంబంధించిన అప్ డేట్ ని కూడా ఇవ్వకపోవడంతో అల్లు శిరీష్ సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారెందుకు? అని అంతా ఆరాతీస్తున్నారు.