శ్రీవాణి ట్రస్టు నిర్వహించేది ఎవరు..?: చంద్రబాబు

తిరుమల శ్రీవాణి ట్రస్టుపై టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.తిరుమల వెంకన్నకు అపచారం తలపెడుతున్నారని పేర్కొన్నారు.

శ్రీవాణి ట్రస్టు నిర్వహించేది ఎవరని ప్రశ్నించారు.శ్రీవాణి టికెట్లకు రసీదు ఇవ్వడం లేదని చంద్రబాబు విమర్శించారు.

రసీదులు లేకుండా తీసుకుంటున్న డబ్బులు ఏమి అవుతున్నాయని నిలదీశారు.వెంకన్నకు అపచారం చేస్తే పుట్టగతులు ఉండవంటూ ధ్వజమెత్తారు.

అన్ని రకాలుగా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు.ప్రస్తుతం ఏపీలో స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి కూడా లేదని విమర్శించారు.

Advertisement

Latest Latest News - Telugu News