రాజమౌళి 'సై' సినిమాను.. నితిన్ తో కాదు ఆ హీరోతో తీయాలనుకున్నాడట?

దర్శకధీరుడు రాజమౌళి ఇటీవలే త్రిబుల్ ఆర్ సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశాడు అన్న విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు కాదు కెరీర్ స్టార్టింగ్ నుంచి దర్శకుడు రాజమౌళి అటు నిర్మాతలు అందరికీ కూడా బంగారు బాతుగా మారిపోయాడు.

ఎందుకంటే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతి సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతూ వచ్చింది.ఇప్పటివరకు ఎంతో మంది హీరోలకు సూపర్ హిట్ లు అందించి కెరీర్ను నిలబెట్టాడు రాజమౌళి.

ఇక ఎన్నో సినిమాలతో అటు యూత్ కి కూడా బాగా దగ్గరయ్యాడు.ఇక ఇలా రాజమౌళిని యూత్ కు బాగా దగ్గర చేసిన సినిమా ఏది అంటే ప్రేక్షకులు ఓకే సినిమా పేరు చెబుతారు అదే సై సినిమా.

ఇక ఈ సినిమా ఇప్పటికీ టీవీలో వచ్చిన టీవీలకు అతుక్కుపోతుంటారు ప్రేక్షకులు.అంతగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకర్షించింది.

Advertisement

ఈ సినిమాలో నితిన్ జెనీలియా హీరోహీరోయిన్లుగా నటించారు అన్నది తెలిసిందే.తెలుగు వాళ్లకు తెలియని ఆట రాగ్బీ గేమ్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు మాత్రం బాగా కనెక్ట్ అయింది.

జూనియర్ ఎన్టీఆర్ తో సింహాద్రి లాంటి సెన్సేషనల్ హిట్ తీసిన తర్వాత రాజమౌళి ఈ సినిమా తీయడం గమనార్హం.అయితే నితిన్ ను హీరోగా పెట్టి రాజమౌళి తెరకెక్కించిన సై సినిమా కోసం ముందుగా నితిన్ ను హీరోగా అనుకోలేదట జక్కన్న.

ఉదయ్ కిరణ్ ను హీరోగా పెట్టి సినిమా తీయాలని భావించాడట.ఊహించని పాపులారిటీ తో ఫుల్ బిజీ గా మారిపోయిన ఉదయ్ కిరణ్ డేట్స్ ఖాళీ లేకపోవడంతో ఇక సై సినిమాను వదులుకున్నాడట.ఇక ఉదయ్ కిరణ్ కాదనడంతో కాస్త అటుఇటుగా ఉదయ్ కిరణ్ పోలికలు ఉండే నితిన్ తో సినిమాకు రెడీ అయిపోయాడు రాజమౌళి.

సై సినిమాలో హీరో పాత్రలో నితిన్ ఎంతలా ఒదిగిపోయాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇక ఆ తర్వాత సై సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..

ఇక సై సినిమా విజయం తరువాత ఈ సినిమాను వదులుకున్నందుకు ఉదయ్ కిరణ్ అప్పట్లో కాస్త బాధ పడ్డాడు అన్న వార్తలు కూడా వచ్చాయి.

Advertisement

తాజా వార్తలు