ఇంటర్వ్యూలో రతన్ టాటా శునకాన్ని వెంట తెచ్చుకున్నప్పుడు...

ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా మంచి వ్యక్తి గానే కాకుండా దయాద్ర హృదయునిగానూ పేరు గాంచారు.

అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా దీనికి సంబంధించిన కథనాలు చూస్తుంటాం.

అలాంటి ఒక ఉదంతం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.హ్యూమన్స్ ఆఫ్ బాంబే వ్యవస్థాపకురాలు మరియు సీఈవో ఒకసారి రతన్ టాటాను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లినప్పుడు ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది.

ఆమె వెళ్లిన సమయంలో రతన్ టాటా కుర్చీలో కూర్చున్నారు.అతని పక్కన ఒక శునకం కూడా ఉంది.

కరిష్మా మెహతా మాట్లాడుతూ ఇది ఒక ప్రత్యేకమైన మరియు మరపురాని ఇంటర్వ్యూ అని పేర్కొన్నారు.ఆమె ఈ ఇంటర్వ్యూ కథనాన్ని ఆయన లింక్డ్‌ఇన్‌లో పంచుకున్నారు.

Advertisement

ఆమె తన లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో షేర్ చేశారు.

నేను అతని (రతన్ టాటా) ఇంటర్వ్యూ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను.ఈసారి కొంచెం భయం వేసింది.ఇంటర్వ్యూ సమయంలో నేను చాలా భయపడ్డాను.

కాని నేను చెప్పిన విషయాలు చాలా వరకు రతన్ టాటా విన్నారు.అప్పుడు నన్ను అడిగారు ఏమైంది అలా ఉన్నావు? అని అన్నారు.నాకు కుక్కలంటే భయం అని రతన్ టాటాతో చెప్పాను.

వెంటనే టాటా తన కుర్చీని కుక్క వైపున తిప్పి.గోవా (కుక్క పేరు) ఆమెకు భయంగా ఉంది కాబట్టి మంచి అబ్బాయిలా నిశ్శబ్దంగా కూర్చో అని చెప్పారు.

పొరుగింటి వ్యక్తిని చెప్పుతో కొట్టిన లేడి పోలీస్... వీడియో వైరల్...
వీడియో: ఇది ఎక్కడ బౌలింగ్ రా బాబు.. ఇట్లా చేతులు తిప్పుతున్నాడేంటి..

ఆ తర్వాత రతన్ టాటా ఇంటర్వ్యూ కొనసాగించాలని కోరారు.దాదాపు 30 నుంచి 40 నిమిషాల పాటు ఇంటర్వ్యూ సాగింది.

Advertisement

అంతసేపటి వరకూ కుక్క నా దగ్గరికి రాలేదు.నేను ఆశ్చర్యపోయాను.

ఎందుకంటే ఎప్పుడూ నా విషయంలో ఇలా జరగలేదు.గోవా అనే కుక్కను రతన్ టాటా తన దగ్గరే ఉంచుకుంటారని కరిష్మా తెలిపారు.

అంతేకాదు ఈ శునకం రతన్ టాటాతో సమావేశానికి కూడా వెళ్తుంటుంది.ఈ ఉదంతం వైరల్‌గా మారింది.

తాజా వార్తలు