బాలయ్య 50 ఇయర్స్ ఇండస్ట్రీ ఈవెంట్ కి ఎన్టీయార్ హాజరవ్వకపోవడానికి కారణం ఏంటంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాలయ్య బాబుకి( Balayya Babu ) ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు ఆయనను చాలా ఉన్నతమైన స్థానం లో నిలిపాయనే చెప్పాలి.

ప్రస్తుతం బాలయ్య బాబు చేస్తున్న వరుస సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలు అందుకోవడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా తీసుకొచ్చి పెట్టాయి.ఇక బాలయ్య బాబు ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యం లో సినిమా ఇండస్ట్రీ మొత్తం అతనికి సన్మాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు.

ఇక దానికి చిరంజీవి, వెంకటేష్ లు చీఫ్ గెస్ట్ లుగా పాల్గొన్న విషయం మనకు తెలిసిందే.

ఇక ఇదిలా ఉంటే ఈ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్( Jr.NTR, Kalyan Ram ) లు మాత్రం హాజరవ్వలేదు.దానికి గల కారణం ఏంటి అనే విషయాల మీదనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంటుంది.

Advertisement

గత కొన్ని రోజుల నుంచి జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణకు మధ్య కొంత వైరమైతే నడుస్తుందనే విషయాలు బయటకు వచ్చాయి.కానీ వాటి మీద ఎలాంటి స్పష్టత అయితే రాలేదు.

కానీ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు చూస్తుంటే మాత్రం ఆ విషయం నిజమే అనే ఒక ఆలోచన అయితే అందరి మదిలో మెదులుతుంది.నిజానికి జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటుడు నందమూరి ఫ్యామిలీ మూడోతరం బాధ్యతలను మోస్తున్నాడు.

కాబట్టి అతన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నందమూరి ఫ్యామిలీ మొత్తానికి ఉందనే చెప్పాలి.ఇక నందమూరి అభిమానులు మాత్రం బాలయ్య బాబుకి సన్మానం జరిగిందని సంతోషపడాలా లేదంటే ఆ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ రాలేదని బాధపడాలా అనే ఒక సందిగ్ధ పరిస్థితిలో ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇదిలా ఉంటే ఈ ఈవెంట్ మాత్రం చాలా గ్రాండ్ గా జరగడం నిజంగా చాలా మంచి విషయం అనే చెప్పాలి.

పవన్ కు వెరైటీగా బర్త్ డే గ్రీటింగ్స్ తెలిపిన 800 మంది విద్యార్థులు.. ఇంత అభిమానమా?
Advertisement

తాజా వార్తలు