అప్పుడప్పుడు నటీనటులు తమ అభిమానులను తమ ప్రవర్తన వల్ల బాధపడేలా చేస్తూ ఉంటారు.నిజానికి జనాలు తాము అభిమానించే హీరోల పట్ల చాలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు.
వారి నుంచి ఎన్నెన్నో ఆశిస్తూ ఉంటారు.కానీ హీరోలు మాత్రం వారు ఎక్స్పెక్ట్ చేసింది అందివ్వకుండా నిరాశ పరుస్తూ ఉంటారు.
ఇప్పుడు ప్రభాస్ విషయంలో కూడా ఫాన్స్ అలాగే ఫీల్ అవుతున్నారు.ఆయన చేసిన పనికి చాలా బాధపడుతున్నారు.
ఇంతకు అసలేం జరిగిందో తెలుసుకుందాం.
ప్రస్తుతం ప్రభాస్( Prabhas ) టాలీవుడ్ లో ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు అని అందరికీ తెలిసిందే.
బాహుబలి తర్వాత ఈయన క్రేజ్ మొత్తం మారిపోయింది.మొత్తం పాన్ ఇండియా సినిమాలకే అలవాటు పడ్డాడు.
ఇతర భాషలకు చెందిన దర్శకులు కూడా ఈయనతో సినిమాలు చేయడానికి క్యూ కడుతున్నారు.
ఇప్పటికే ఆయన బాహుబలి ( Baahubali )తర్వాత పలు పాన్ ఇండియా సినిమాలతో ముందుకు వచ్చాడు.
కానీ ఆ సినిమాలు ఆయనను నిరాశపరిచాయి.అయినప్పటికీ ఈయనకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి.
ఇక ప్రస్తుతం ఆయన ఆది పురుష్ సినిమాతో పాటు మరిన్ని పాన్ ఇండియా మూవీస్ తో బిజీగా ఉన్నాడు.ఇక ఆదిపురుష్ నుండి విడుదలైన ట్రైలర్, పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులకు ఓ రేంజ్ లో అంచనాలు పెంచాయి.
ఇక రీసెంట్ గా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను తిరుమలలో ఘనంగా నిర్వహించారు.ఇక ఈ ఈవెంట్ కోసం ఏకంగా మూడు కోట్లు ఖర్చు చేసినట్లు తెలిసింది.ఇక ఇందులో ప్రభాస్, కృతి సనన్ తో( Kriti Sanon ) పాటు సినీ బృందం మొత్తం పాల్గొని బాగా సందడి చేశారు.అయితే ఈ ఈవెంట్ లో కొన్ని తప్పులు అయితే జరిగాయి.
అదేంటంటే ఆసక్తికరంగా కట్ చేసిన ట్రైలర్ ను టెలికాస్ట్ చేయటంతో సినీ బృందం కాస్త నిరాశ పడినట్లు తెలిసింది.అంతేకాకుండా సినిమా గురించి ఎవరు కూడా ఎక్కువ విషయాలు పంచుకోలేకపోవటంతో ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు.ఇక ముఖ్యంగా ప్రభాస్ విషయంలో ఎక్కువగా ఫీల్ అవుతున్నట్లు కనిపించింది.కారణం ఏంటంటే అంత ఘనంగా ఏర్పాటు చేసిన ఈవెంట్ లో ప్రభాస్ కోసం చాలామంది వేలు ఖర్చు పెట్టి ఎంట్రీ పాస్ లు తీసుకొని ఆయన మాటలు వినాలి అని ఎంతో ఆరాటపడ్డారు.
కానీ ప్రభాస్ తిప్పి కొడితే స్టేజిపై ఒక గంట కూడా లేడని.అంతేకాకుండా ఆయన సరిగా మాట్లాడలేదని.ఇక ఆ ఈవెంట్ కు హోస్ట్ గా చేసిన ప్రదీప్ ప్రభాస్ ను మూడు ప్రశ్నలు వేయాలని అనుకున్నాడు.దీంతో చివర్లో ఆయనతో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నప్పుడు ప్రభాస్ ఆయన మాటలు వినకుండా వెంటనే జైశ్రీరామ్ అంటూ తన స్పీచ్ కు ముగింపు పలికాడు.
ఇక ప్రభాస్ ఇలా చేయటంతో అందరూ చాలా ఫీల్ అయినట్లు కనిపించారు.దీంతో ఈవెంట్ కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అందరు ప్రభాస్ గురించే చెప్పుకొస్తున్నారు.