పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు.సీబీఐ ప్రధాన కార్యాలయానికి రిపోర్ట్ చేయకుండా.
కేంద్ర హోంశాఖకు రిపోర్ట్ చేస్తోందన్నారు.సీబీఐ, ఈడీలకు భయపడి వ్యాపారవేత్తలు దేశం విడిచి పారిపోతున్నారని చెప్పారు.
వ్యాపారులపై బీజేపీ కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందన్న దీదీ.ఇదంతా మోదీ చేయడం లేదని భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు.
అనంతరం, ప్రతిపక్షాలకు చెందిన నేతలను బీజేపీ వేధిస్తోందని మమతా బెనర్జీ ఆరోపించారు.అక్రమ అరెస్టులు చేయిస్తూ బెదిరింపులకు పాల్పడుతోందని విమర్శించారు.
దర్యాప్తు సంస్థలు ఈ విధంగా వ్యవహరించవచ్చా అని ఆమె ప్రశ్నించారు.పీఎంఓకు రిపోర్ట్ చేయాల్సిన అధికారులు.
కేంద్ర హోంశాఖ పరిధిలో పని చేస్తుండటం బాధాకరమని వ్యాఖ్యనించారు.








