ఏపీలో టీడీపీ నేత నారా లోకేశ్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్రకు ఆటంకాలు సృష్టించవద్దని ఆ పార్టీ నేత, పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ అన్నారు.పాదయాత్రకు ఆటంకాలు సృష్టిస్తే తాడేపల్లి ప్యాలెస్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
టీడీపీ ప్రజాస్వామ్యయుతంగా ర్యాలీ చేస్తోందని పేర్కొన్నారు.అయితే బొల్లా బ్రహ్మనాయుడును పోలీసులు ఎందుకు అనుమతించారని ఆయన ప్రశ్నించారు.
వినుకొండలో బొల్లా బ్రహ్మనాయుడు ఆక్రమణలకు పాల్పడ్డారని ఆరోపించారు.ఈ క్రమంలోనే వినుకొండలో టీడీపీ నేతలపై జరిగిన దాడులను గవర్నర్ అబ్దుల్ నజీర్ దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.







