వ్యూహం చిత్రంపై విచారణ రేపటికి వాయిదా..!

సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma ) తెరకెక్కించిన ‘వ్యూహం’( Vyuham ) చిత్రంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్ తో పాటు రికార్డులను సెన్సార్ బోర్డ్ కోర్టుకు సమర్పించింది.

 Vyuham Movie Hearing Is Adjourned To Tomorrow Details, Director Ramgopal Varma,-TeluguStop.com

ఈ క్రమంలో రికార్డులను పరిశీలించిన తరువాత విచారణ జరుపుతామని కోర్టు తెలిపింది.అదేవిధంగా ఈ పిటిషన్ పై న్యాయస్థానం రేపు మరోసారి వాదనలు విననుంది.

ఈ నేపథ్యంలోనే తదుపరి విచారణను తెలంగాణ హైకోర్టు( Telangana High Court ) రేపటికి వాయిదా వేసింది.

అయితే టీడీపీ అధినేత చంద్రబాబు,( Chandrababu ) ఆ పార్టీ నేత లోకేశ్ తో( Lokesh ) పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను( Pawan Kalyan ) కించ పరిచే విధంగా సినిమాలో కొన్ని సన్నివేశాలు ఉన్నాయని పేర్కొంటూ కోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.దీంతో ఈ నెల 11వరకు సినిమా విడుదలను నిలిపివేస్తూ కొద్ది రోజుల కిందట సింగిల్ బెంచ్ ఉత్తర్వులను జారీ చేసింది.ఈ ఉత్తర్వులను చిత్ర బృందం డివిజన్ బెంచ్ లో సవాల్ చేసిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube