ఏపీ రాష్ట్రాన్ని నంబర్ వన్ గా చేయడమే తమ ధ్యేయమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.నిర్దిష్ట లక్ష్యాల సాధన కోసం విజన్ 2029 అని తెలిపారు.
తెలుగు జాతి ఎక్కడున్నా అగ్రస్థానంలో ఉండాలని చంద్రబాబు పేర్కొన్నారు.తెలుగు ప్రజల కోసం నిరంతరం శ్రమించిన పార్టీ టీడీపీ అని తెలిపారు.
టీడీపీ హయాంలో ఎవరూ సాధించలేని అభివృద్ధిని సాధించామన్న ఆయన ఏపీలో రెండో తరం సంస్కరణలు తీసుకొచ్చామని చెప్పారు.కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి కనీసం రాజధాని కూడా లేకుండా పోయిందని విమర్శించారు.