తన టీమ్ తో ఫిల్మ్ నగర్ చేరుకున్న విశాల్ !

కోలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో విశాల్.

ఈయన తెలుగువాడైన కూడా కోలీవుడ్ లో హీరోగా రాణిస్తూ వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.

ఇటు టాలీవుడ్ లో కూడా విశాల్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.తెలుగులో కూడా తనకంటూ మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నాడు విశాల్.

వరస హిట్స్ తో కెరీర్ ను జెట్ స్పీడ్ తో దూసుకు పోతున్నాడు.ఈ మధ్యనే విశాల్ మరొక కొత్త సినిమాను అనౌన్స్ చేయడంతో మళ్ళీ అందరి ద్రుష్టి విశాల్ మీద పడింది.

ఇది కూడా రేజిలర్ సినిమాలా కాకుండా ఒక డిఫరెంట్ కథతో దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాకు శరవరణ్ దర్శకత్వం చేయనున్నారు.

Advertisement

నాట్ ఏ కుమార్ మ్యాన్ అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమాను దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమా విశాల్ కెరీర్ లో 31 వ సినిమాగా తెరకెక్కుతుంది.

ఈ సినిమా మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన ఒక వ్యక్తి అధికార దుర్వినియోగాన్ని ఎలా అడ్డుకున్నాడో అనేది ఈ కథ సారాంశం.ఈ సినిమా షూటింగ్ మొదలైన తర్వాత మళ్ళీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది.అయితే తమిళనాడులో ఇంకా లాక్ డౌన్ సడలింపులు లేనందున షూటింగ్ మొదలు పెట్టలేదు.

అందుకే చిత్ర యూనిట్ హైదరాబాద్ కు మకాం తెలుస్తుంది.

ఇక్కడ ఈ మధ్యనే షూటింగ్స్ కు అనుమతి ఇవ్వడంతో విశాల్ తన టీమ్ తో కలిసి రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ చేయడానికి వాచినట్టు తెలుస్తుంది.అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ స్టార్ట్ చేసినట్టు టాక్.ఈ సినిమాలో తెలుగు ముద్దుగుమ్మ డింపుల్ హయతి హీరోయిన్ గా నటిస్తుంది.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

ఈ సినిమాను విశాల్ స్వయంగా నిర్మించడం విశేషం.

Advertisement

తాజా వార్తలు