వైసీపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి.సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీ పరిపాలన రాజధానిగా విశాఖపట్నం నీ ఎవరు ఆపలేరని పేర్కొన్నారు.టీడీపీ అధినేత చంద్రబాబు తల్లకిందులుగా తపస్సు చేసినా గాని పరిపాలన రాజధానిగా విశాఖను ఎవరు అడ్డుకోలేరని పేర్కొన్నారు.
విశాఖపట్టణంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రపతి ఎన్నికల్లో తమ పార్టీ మద్దతు ఎవరికి ఇవ్వాలన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు.
ఈ విషయంలో వైఎస్ జగన్ నిర్ణయమే ఫైనల్ అని తెలిపారు.
అయిన అణగారిన వర్గాలకి అత్యున్నత పదవులు ఇస్తామంటే ఎవరు కాదంటారని విజయసాయి రెడ్డి తనదైన శైలిలో కామెంట్లు చేశారు.టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు పై కూడా సీరియస్ వ్యాఖ్యలు చేశారు.
ఆక్రమణల విషయంలో.అధికారులు చర్యలు తీసుకుంటారని విజయసాయి రెడ్డి తనదైన శైలిలో పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే ఎన్డీఏ రాష్ట్ర పార్టీ అభ్యర్థి ద్రౌపది ముర్మునీ ఇటీవల విజయసాయిరెడ్డి కలవటంతో దాదాపు వైసీపీ మద్దతు ఎన్డీఏ అభ్యర్థికి అనే టాక్ జాతీయ మరియు రాష్ట్ర రాజకీయాలలో వినపడుతోంది.