కూలిన వేదిక .. కిందపడ్డ విజయశాంతి

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో కాంగ్రెస్‌ ప్రచార సభలో అపశ్రుతి చోటుచేసుకుంది.కాంగ్రెస్ ప్రచార సభలో ఏర్పాటు చేసిన వేదిక ఒక్కసారిగా కూలిపోయింది.

స్టేజీపై నాయకులంతా కూర్చొని ఉండగా ఆ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతి నిలబడి పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తున్నారు.అదే సమయంలో సభా వేదిక ఒక్కసారిగా కూలింది.

ఈ ఘటనలో విజయశాంతి వేదికపై నుంచి కింద పడ్డారు.ఘటన జరిగిన సమయంలో వేదికపై విజయశాంతి, భట్టివిక్రమార్క, నంది ఎల్లయ్య, పలువురు నాయకులు ఉన్నారు.

అదృష్టవశాత్తూ ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు.

Advertisement
రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు