విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంపై పునరాలోచన చేయాలని కోరుతూ 120 మంది పార్లమెంట్ సభ్యుల సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సమర్పించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నాయకులు.విశాఖ ఉక్కు ప్రయివేటికరణకు వ్యతిరేకంగా పార్లమెంట్ లో 120 మంది ఎంపీలతో సంతకాలు పెట్టించాము.
అవి కేంద్రానికి కూడా పంపాము.బీజేపీయేతర ఎంపీలు సైతం సంతకాలు పెట్టారు.
చంద్రబాబు, పప్పు నాయుడు దీనిపై పదే పదే విమర్శలు చేస్తున్నారు.కానీ దీని పై సంతకాలు పెట్టమంటే టీడీపీ సభ్యులు ఒక్కరు కూడా పెట్టలేదు.యాభై పై చిలుకు సంస్థల ను ప్రయివేటికరణ చేసిన ఘనత చంద్రబాబు ది.ఇక్కడ మాట్లాడే మాటలు ఒక్కటి కూడా టీడీపి ఎంపీలు ఢిల్లీలో మాట్లాడలేదు.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవటానికి కలిసి రమ్మని అడిగినా టీడీపీ సభ్యులు నిరాకరించారు టీడీపీ ద్వంద్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారు