కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో వైసీపీ పెద్ద పాత్ర అంటున్న విజయసాయిరెడ్డి..!!

వైసీపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి( MP Vijaysai Reddy ) సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈసారి కేంద్రంలో ప్రభుత్వం( Central Govt ) ఏర్పాటు చేయడంలో వైసీపీ( YCP ) పెద్ద పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు.

ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేయడం జరిగింది."ఢిల్లీలో ఎన్డీఏ 30 పార్టీల భాగస్వాముల సమావేశం అదేవిధంగా బెంగళూరులో 24 పార్టీల ప్రతిపక్షాల సమావేశం జరుగుతోంది.

కానీ ఈసారి ఢిల్లీకి ఆంధ్రప్రదేశ్ యే మార్గం కాబోతోంది అని స్పష్టం చేశారు.ఆంధ్రప్రదేశ్ ప్రజల ఓట్లు మరియు వైసీపీ మద్దతుతోనే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు కానుంది అని చెప్పుకొచ్చారు.

నేషనల్ మీడియా సైతం ఇదే చెబుతుంది అన్ని సర్వేలలో వైసీపీ విజయం సాధిస్తుందని".అంటూ ట్వీట్ చేశారు.

Advertisement

రేపు ఢిల్లీలో ఎన్డీఏ( NDA ) భాగస్వాముల సమావేశం జరగబోతుంది.ఇలాంటి తరుణంలో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో వైసీపీ పెద్ద పాత్ర అని విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో కామెంట్లు చేయడం జాతీయస్థాయిలో సంచలనంగా మారింది.ఇప్పటికే పార్లమెంటులో వైసీపీ ఎంపీల బలం 20కి పైగా ఉంది.

ఇక రాజ్యసభలో సైతం రానున్న రోజుల్లో వైసీపీ అభ్యర్థుల కీలకము కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.దీంతో కేంద్రంలో రాబోయే రోజుల్లో వైసీపీ ప్రముఖ పాత్ర పోషించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు