'లైగర్' ట్రైలర్ సక్సెస్ ను ఆమెతో కలిసి ఆస్వాదిస్తున్న విజయ్.. పిక్ వైరల్!

యంగ్ అండ్ సెన్సేషనల్ హీరోగా అంతకంతకు ఎదుగుతున్నాడు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ.విజయ్ దేవరకొండకు టాలీవుడ్ లో మాత్రమే కాదు బాలీవుడ్ లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగి పోతుంది.

ఆయన ప్రతి ఒక్కరికి ఫేవరేట్ హీరోగా మారి పోతున్నాడు.ప్రెసెంట్ విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ సినిమా మరొక నెల రోజుల్లో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధం అవుతున్నాడు.

ఆగష్టు 25న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.మొదటి సారి పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు విజయ్ ఇంకా పూరీ.

ఈ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో విజయ్ మరింత స్టార్ డమ్ ను పెంచుకోవాలని చూస్తున్నాడు.ఇక రిలీజ్ కూడా దగ్గర పడడంతో మేకర్స్ ప్రొమోషన్స్ లో స్పీడ్ పెంచుతున్నారు.

Advertisement

ఈ క్రమంలోనే ఇటీవలే ఈ సినిమా నుండి థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా విశేష స్పందన లభించింది.

లైగర్ కు మాస్ ప్రేక్షకుల్లో ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉందో అనేది ట్రైలర్ తోనే తేలిపోయింది.ఈ ట్రైలర్ కూడా యూట్యూబ్ లో భారీ రికార్డులను క్రియేట్ చేస్తూ రికార్డులను బద్దలు కొడుతోంది.ఈ ట్రైలర్ కు ఇంత రెస్పాన్స్ రావడంతో టీమ్ మొత్తం ఖుషీగా ఉంది.

మొన్నటి వరకు ప్రొమోషన్స్ చేయలేదని బాధపడిన ఫ్యాన్స్ సైతం ట్రైలర్ తో సంతృప్తి వ్యక్తం చేసారు.

దీంతో రౌడీ స్టార్ కూడా గాలిలో తేలిపోతున్నాడు.అందుకే ఈ సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకుంటున్నాడు.తాజాగా విజయ్ దేవరకొండ ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన ఛార్మీ కౌర్ తో కలిసి బార్ లో కనిపించాడు.

పొరుగింటి వ్యక్తిని చెప్పుతో కొట్టిన లేడి పోలీస్... వీడియో వైరల్...
ఏకంగా హీరోనే డామినేట్ చేసిన టాలెంటెడ్ యాక్టర్స్.. ఎవరంటే..? 

ముంబై లోని రిచ్ రెస్టో బార్ లో వైన్ తాగుతూ ఈ ఇద్దరు ఫొటోకు ఫోజు ఇచ్చారు.ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారుతుంది.ఇక సినిమా రిలీజ్ అయితే కానీ ఇది ఎంత సక్సెస్ అవుతుందో తెలుస్తుంది.

Advertisement

ఇక ఈ సినిమాలో లైగర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది.హై వోల్టేజ్ స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కిన ఈ సినిమాను పూరీ కనెక్ట్స్ ఇంకా ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించారు.

తాజా వార్తలు