రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన లైగర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది.మరో వైపు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో విజయ్ దేవరకొండ ఒక సినిమాను చేస్తున్నాడు.
ఆ సినిమా గతంలోనే చేయాల్సి ఉంది.మైత్రి మూవీ మేకర్స్ వద్ద విజయ్ దేవరకొండ గీత గోవిందం సమయంలో భారీ మొత్తంలో అడ్వాన్స్ ను తీసుకోవడం జరిగింది.
అప్పుడే ఒక పాన్ ఇండియా సినిమా ను ఆనంద్ అన్నామలై అనే దర్శకుడితో సినిమాను చేసేందుకు మైత్రి మూవీ మేకర్స్ వారు సిద్దం అయ్యారు.అంతా బాగానే ఉంది అనుకుంటూ ఉన్న సమయంలో విజయ్ దేవరకొండ తో మైత్రి మూవీ మేకర్స్ వారు తీయాలనుకున్న పాన్ ఇండియా మూవీ ‘హీరో’ క్యాన్సిల్ అయ్యింది.
దర్శకుడు కొరటాల శివ క్లాప్ కొట్టగా ప్రముఖులు పూజా కార్యక్రమాలు హాజరు అవ్వగా షూటింగ్ ప్రారంభోత్సవం జరిగింది.అలాంటి సినిమా ఆగిపోవడం ఏంటో అంటూ అంతా కూడా ముక్కున వేలేసుకున్నారు.
అసలు ఏం జరిగింది అనే విషయం లో క్లారిటీ లేదు.కాని హీరో సినిమా క్యాన్సిల్ అవ్వడం వల్ల మైత్రి మూవీ వారికి జరిగిన నష్టం మాత్రం ఎక్కువే అనాలి.
సినిమా షూటింగ్ పూర్తి అయ్యి విడుదల అయితే అంతకు మించి నష్టం వస్తుందేమో అనే ఉద్దేశ్యంతో దాదాపుగా మూడు కోట్ల వరకు ఖర్చు పెట్టినా కూడా హీరో విషయం లో వెనక్కు తగ్గినట్లుగా మైత్రి మూవీ మేకర్స్ వారు చెబుతున్నారు.హీరో సినిమా కోసం అడ్వాన్స్ ఇవ్వడంతో ఇప్పుడు మైత్రి వారితో సినిమా ను చేస్తున్నాడు.
ఇక హీరోయిన్ గా మాళవిక మోహనన్ కు దాదాపుగా పాతిక లక్షల అడ్వాన్స్ ను ఇవ్వడం జరిగింది.షూటింగ్ కార్యక్రమాల కు ఏర్పాటు చేయడంతో పాటు పూజా కార్యక్రమాలకు భారీగానే ఖర్చు చేశారు.
దర్శకుడు స్క్రిప్ట్ వర్క్ చేయడం కోసం భారీగా ఖర్చు చేసి దాన్ని కూడా మైత్రి వాళ్ల మీదే వేశాడు.మొత్తానికి మైత్రి వారికి విజయ్ దేవరకొండ ‘హీరో’ వల్ల దాదాపుగా మూడు కోట్ల వరకు నష్టం జరిగింది అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్.