ఆ ఏపీ మంత్రి స్వామి ద‌ర్శ‌నానికి వెళ్లి హుండీ కొట్టేస్తాడా... పంచ్ పేలిందిగా..!

ఏపీ దేవాదాయ శాఖా మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస్‌పై టీడీపీ ఎమ్మెల్సీ మంతెన స‌త్య‌నారాయ‌ణ రాజు తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు.అంతే కాకుండా ఆయ‌న‌పై ప‌దునైన పంచ్‌లు విసిరారు.

వెల్లంప‌ల్లి దేవుడు ద‌ర్శ‌నానికి వెళ్లి గుడిలో హుండీ కొట్టేసే టైప్ మ‌నిషి అని.ఆయ‌న‌కు దేవాదాయ శాఖ ఇచ్చినందుకు దేవుడు కూడా బాధ‌ప‌డుతున్నాడు అని స‌త్య‌నారాయ‌ణ రాజు విమ‌ర్శించారు.వెల్లంప‌ల్లి వార్డు మెంబ‌ర్‌కు ఎక్కువ‌.కార్పొరేట‌ర్‌కు త‌క్కువ అని విమ‌ర్శించారు.

వెల్లంప‌ల్లి కాలం క‌లిసొచ్చి మంత్రి అయ్యార‌ని.అలాంటి వ్య‌క్తి  రాజ‌కీయంగా ఎంతో అనుభ‌వం ఉన్న చంద్ర‌బాబు నాయుడిని తిట్ట‌డం సిగ్గు చేట‌ని దుయ్య‌బ‌ట్టారు.

వెల్లంప‌ల్లికి జ‌గ‌న్ భ‌జ‌న‌లు, కీర్త‌న‌లు త‌ప్పా మిగిలిన‌వి పట్ట‌వా ? అని ఫైర్ అయ్యారు.ఏపీలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వ‌చ్చి 16 నెల‌లు అవుతోంద‌ని.

Advertisement

ఈ 16 నెల‌ల్లో ఆయ‌న దేవాదాయ శాఖా మంత్రిగా చేసిందేంట‌ని ప్ర‌శ్నించారు.ఇక ఆయ‌న‌కు భ‌క్తుల మ‌నోభావాలు ప‌ట్ట‌వ‌ని.

భూక‌బ్జాల‌పై చూపించిన శ్ర‌ద్ధ త‌న దేవాదాయ శాఖ‌పై చూపించ‌డం లేద‌ని విమర్శించారు.దేవాల‌యాల‌కు ఎంత ఆదాయం వ‌స్తుంద‌ని చూస్తున్నారే త‌ప్పా అక్క‌డ భ‌క్తుల‌కు సౌక‌ర్యాలు ఎలా ఉంటున్నాయో మంత్రికి ప‌ట్ట‌డం లేద‌ని మంతెన అన్నారు.

ఇక ఆయ‌న‌కు లాక్‌డౌన్‌లో అర్చ‌కులు ప‌డ్డ ఇబ్బందులు కూడా ప‌ట్ట‌లేద‌ని.అర్చ‌కుల‌కు ఇస్తామ‌న్న సాయం అంద‌క‌పోయినా ఆయ‌న ప‌ట్టించుకోవ‌డం లేద‌న్నారు.

వెల్లంప‌ల్లి ఇప్ప‌ట‌కి అయినా త‌న దేవాదాయ శాఖ‌పై దృష్టి పెట్టి ప‌ని చేస్తూ. రాజ‌కీయాలు మాట్లాడ‌డం మానేయాల‌ని మంతెన సూచించారు.

కడప ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు