పవన్ తప్పుకోవడంతో ఆ రెండు సినిమాలు రెడీ.. ఎవరిది పై చేయి అయ్యేనో!

గత మూడు నాలుగు వారాలుగా కొనసాగుతున్న సస్పెన్స్ కు తెర పడింది.

పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా విడుదల ఫిబ్రవరి 25న కావడం లేదు.

దాంతో ఆ సినిమా విడుదల అవ్వాల్సిన ఫిబ్రవరి 25 వ తారీఖున మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన గని మరియు శర్వానంద్ హీరోగా నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా విడుదలకు సిద్ధమవుతున్నాయి.ఈ రెండు సినిమాలు కూడా మంచి అంచనాల నడు విడుదల కాబోతున్నాయి.

వరుణ్ తేజ్ హీరోగా నటించిన గని సినిమా కు కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహించగా అల్లు అరవింద్ తనయుడు అల్లు బాబీ తన స్నేహితుడు సిద్దు ముద్ద తో కలిసి నిర్మించడం జరిగింది.భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ కు జోడీగా సాయి మంజ్రేకర్ ను హీరోయిన్ గా నటింప జేశారు.

ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా కనిపించబోతున్నాడు.ఇప్పటికే విడుదలైన పోస్టర్లు మరియు టీజర్ సినిమా పై అంచనాలను భారీగా పెంచాయి.

Advertisement

ఇక మరో వైపు శర్వానంద్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వం లో రూపొందిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా కూడా ఫిబ్రవరి 25 వ తారీఖున విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రేక్షకుల్లో ఆసక్తి వ్యక్తమవుతోంది.ఈ సినిమా లో శర్వానంద్ కు జోడీగా రష్మిక మందన్నా నటించడం వల్ల అంచనాలు భారీగా పెరిగాయి.

పుష్ప సినిమా తర్వాత రష్మిక స్థాయి అమాంతం పెరిగింది.కనుక ఆమె నటించిన సినిమా అవ్వడం వల్ల ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా కు మంచి స్పందన వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.ఈ రెండు సినిమాలు ఒకే రోజు రాబోతున్న నేపథ్యం లో పరిస్థితి ఎలా ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.25వ తారీఖున రాకుండా వాయిదా పడ్డ భీమ్లా నాయక్ కొత్త విడుదల తేదీ అతి త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు