కోలీవుడ్ స్టార్ హీరోల్లో విజయ్ దళపతి ఒకరు.ఈయన ప్రెజెంట్ కోలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగుతూ ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతున్నాడు.
వరుస హిట్స్ తో వందల కోట్లు వసూళ్లు చేస్తూ కోలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ డమ్ అందుకున్నాడు.ఈయన గత సినిమా బీస్ట్ ప్లాప్ టాక్ తెచ్చుకున్న వసూళ్లు మాత్రం బాగా వచ్చాయి.
ఇక ఈసారి అయిన సూపర్ హిట్ అందుకోవాలని విజయ్ కష్టపడుతున్నాడు.
ప్రెజెంట్ విజయ్ తెలుగు డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడు.
టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.విజయ్ దళపతి నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు వారసుడు అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు.
తమిళ్ లో ‘వరిసు’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ క్రేజీ సినిమాపై ఇప్పటికే తమిళ్ లో అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.
దిల్ రాజు భారీ స్థాయిలో శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ పై పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్న ఈ సినిమా నుండి తాజాగా మరో అప్డేట్ బయటకు వచ్చింది.
ఈ సినిమా షూట్ ఆల్ మోస్ట్ పూర్తి కాగా ఇక ప్రొమోషన్స్ లో స్పీడ్ పెంచనున్నారు.తాజాగా ఈ సినిమా నుండి గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారని అది కూడా ఆడియో ఫంక్షన్ అని తెలుస్తుంది.
ఈ ఈవెంట్ ను ముందుగా తమిళ్ లోనే ప్లాన్ చేశారట.మరి ఈ ఈవెంట్ ఎప్పుడు జరగబోతుందా అనే దానిపై వార్తలు వైరల్ అవుతున్నాయి.ఈ సినిమా ఆడియో ఫంక్షన్ నెక్స్ట్ లెవల్లో నెవర్ బిఫోర్ అనేలా డిసెంబర్ 24న చేయబోతున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిందే.
ఇదిలా ఉండగా ఖుష్బూ, మీనా, శ్రీకాంత్, జయసుధ, యోగిబాబు, శరత్ కుమార్ వంటి వారు నటిస్తున్నఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది.