దుత్త రామచంద్రరావు తో భేటీ అయిన వంశీ

గత కొద్దీ రోజులుగా టీడీపీ నేత వల్లభనేని వంశీ వైసీపీ పార్టీలో చేరుతున్నట్లు వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.ఇంకా ఆయన నుంచి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ వంశీ వైసీపీ లో చేరుతున్నట్లు మాత్రం విపరీతంగా ప్రచారం జరుగుతుంది.

 Vallabhaneni Vamsi Meet Ycp Leader Ramachandrarao-TeluguStop.com

ఈ క్రమంలో తాజాగా వల్లభనేని వంశీ వైసీపీ నేత దుత్త రామచంద్రరావు తో భేటీ అవ్వడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.వైసీపీ నేత దుత్త వైఎస్ కుటుంబానికి సన్నిహితుడు కూడా కావడం తో వంశీ ఆయన తో భేటీ అవ్వడం తో ఇక అధికారికంగా వంశీ వైసీపీ చేరిపోనున్నారు అన్న అనుమానాలకు బలం చేకూరినట్లు అయ్యింది.

గత కొద్దీ రోజులుగా టీడీపీ పార్టీ పై అసంతృప్తి తో ఉన్న వంశీ ఈ క్రమంలో ఆ పార్టీ పై కొన్ని విమర్శలు కూడా చేశారు.అంతేకాకుండా ఆ పార్టీ లో లోకేష్ తీరు పై కూడా వంశీ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం విదితమే.

ఈ క్రమంలో వంశీ త్వరలో టీడీపీ గుడ్ బై చెప్పి వైసీపీ జెండా కప్పుకోనున్నారు అంటూ తెగ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

Telugu Duttarama, Gannavarammla-

అయితే తాజాగా దుత్త తో వంశీ భేటీ అవ్వడం తో ఇప్పుడు ఆ అనుమానాలకు బలం చేకూరినట్లు అయ్యింది.మొత్తానికి వైసీపీ లో చేరడానికి వంశీ తనదైన శైలి లో పావులు కదుపుతూ మెల్లిగా అడుగులువేస్తున్నట్లు అర్ధం అవుతుంది.అయితే ఈ భేటీ లో ఏ అంశం పై ఇరువురి మధ్య చర్చ జరిగింది అన్న వివరాలు మాత్రం వెల్లడికాలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube