రెండు తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై నేడు కీలక సమావేశం జరగనుంది.కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అధికారులు భేటీ కానున్నారు.
తెలుగు రాష్ట్రాల సీఎస్లతో పాటు రైల్వే బోర్డు చైర్మన్ సహా వివిధశాఖల అధికారులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.సమావేశం అజెండాలో పొందుపరిచిన మొత్తం 14 అంశాలపై చర్చించనున్నారు.
విభజన చట్టం షెడ్యూల్ 9 లోని ఆస్తుల పంపకాలపైనా భేటీలో చర్చించనున్నట్టు సమాచారం.కొత్త రాజధాని ఏర్పాటుకు కేంద్ర సహకారం, విద్యాసంస్థల స్థాపన, రాజధాని నుంచి ర్యాపిడ్ రైల్ అనుసంధానంపై చర్చించాలని కేంద్ర హోంశాఖ ఎజెండాలో పొందుపరిచింది.