ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది.ప్రగతిమైదాన్ కన్వెన్షన్ సెంటర్ లో సమావేశం జరగనుంది.
మంత్రిత్వ శాఖల వారీగా పురోగతి, అభివృద్ది కార్యక్రమాలపై ప్రధానంగా చర్చించనున్నారని తెలుస్తోంది.అదేవిధంగా విధాన పరమైన నిర్ణయాలపైనా కూడా కేంద్ర కేబినెట్ చర్చించే అవకాశం ఉందని సమాచారం.
మంత్రిత్వ శాఖల వారీగా పురోగతి వివరాలను మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, మంత్రులు ప్రధాని మోదీకి వివరించనున్నారు.కాగా ఈ భేటీ రాత్రి వరకు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది.
కేబినెట్ భేటీ అనంతరం మంత్రులకు ప్రధాని మోదీ విందు ఇవ్వనున్నారు.







