మెగా డాటర్ నిహారిక( Niharika ) యాంకర్ గా, వెబ్ సిరీస్ ల ద్వారా సక్సెస్ సాధించినా హీరోయిన్ గా మాత్రం ఆమెకు అనుకున్న ఫలితాలు దక్కలేదు.అభినయ ప్రధాన పాత్రలను ఎంచుకోవడం, ఆ సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కకపోవడం నిహారికకు మైనస్ అయింది.
అయితే ఉగాది పండుగ( Ugadi ) నిహారికకు కలిసిరాలేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఉగాది పండుగ సమయంలోనే నిహారిక వరుసగా వివాదాల్లో చిక్కుకోవడం హాట్ టాపిక్ అవుతోంది.
గతేడాది ఉగాది సమయంలో బంజారాహిల్స్ లోని ప్రముఖ హోటల్ పై దాడులు జరగగా ఆ సమయంలో అక్కడ నిహారిక ఉండటంపై సోషల్ మీడియా( Social Media )లో విమర్శలు వ్యక్తమయ్యాయి.అప్పటినుంచి నిహారిక సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటున్నారని సమాచారం అందుతోంది.ఈ ఏడాది ఉగాది పండుగ సమయంలో నిహారిక ఆమె భర్తతో విడిపోతున్నట్టు కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.
నిహారిక కెరీర్ పరంగా ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే.
నిహారిక పలు వెబ్ సిరీస్ లను సొంత బ్యానర్ లో నిర్మిస్తూ క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు.అయితే వ్యక్తిగత జీవితంలో వివాదాస్పద విషయాల ద్వారా నిహారిక తరచూ వార్తల్లో నిలవడం ఫ్యాన్స్ కు నచ్చడం లేదు.
వరుస వివాదాలు నిహారిక కెరీర్ కు కూడా మంచిది కాదు.
ప్రతి ఇంట్లో సాధారణంగా చిన్నచిన్న సమస్యలు ఉంటాయి.భార్యాభర్తల మధ్య చిన్నచిన్న విషయాలకు గొడవలు జరుగుతుంటాయి.ఆ గొడవలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటే మంచిదని చెప్పవచ్చు.
నిహారిక కెరీర్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.నిహారిక చైతన్య క్యూట్ కపుల్ అని ఈ జంట విడిపోతే ఫ్యాన్స్ సైతం ఫీలవ్వడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
నిహారికను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండటం గమనార్హం.