నందమూరి బాలకృష్ణ నటించిన రూలర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ మూవీగా నిలవడంతో తన నెక్ట్స్ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు.ఈ క్రమంలోనే మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్లో తన నెక్ట్స్ మూవీని రెడీ చేస్తున్నాడు.
కాగా ఈ సినిమాను ఇటీవల ప్రారంభించిన బాలయ్య, రెగ్యులర్ షూటింగ్ను కూడా ప్రారంభించగా, ప్రస్తుతం కరోనా కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడింది.
ఇక ఈ సినిమాతో బాలయ్య మరోసారి ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది.
కాగా ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తుండగా, అందులో అఘోరా పాత్ర చాలా కీలకంగా ఉంటుందని, ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ అంటోంది.అయితే ఈ సినిమా చాలా పవర్ఫుల్గా ఉండనుండటంతో బాలయ్యను ఢీకొట్టే విలన్లు కూడా అంతే పవర్ఫుల్గా ఉండేటట్టు బోయాపటి చూసుకుంటున్నాడు.
ఇప్పటికే శ్రీకాంత్ను ఒక విలన్ పాత్ర కోసం ఎంపిక చేయగా, మరో విలన్ కోసం ఓ బాలీవుడ్ నటుడిని తీసుకునేందుకు బోయపాటి చర్చలు జరుపుతున్నాడు.
మొత్తానికి ఈ సినిమాలో బాలయ్య ఎంత పవర్ఫుల్గా కనిపిస్తాడో, ఆయన్ను ఢీకొట్టే విలన్లు కూడా అంతే పవర్ఫుల్గా ఉండేటట్టు చూసుకుంటున్నారు.
ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్ ఎవరనే అంశంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.కాగా లాక్డౌన్ ముగిసిన వెంటనే ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టాలని బాలయ్య అండ్ టీమ్ రెడీ అవుతున్నారు.
మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.