ఇప్పటికే కేంద్రంతో ఎడముఖం పెడముఖంగా వ్యవహరిస్తున్న ట్వీట్టర్ ఈసారి చేయకూడని తప్పు చేసి కేంద్రం ఆగ్రహానికి గురైంది.ఒకరకంగా ట్వీట్టర్ చేసిన పనికి కేంద్రం మాత్రం ఈసారి ఉపేక్షించే స్దితిలో లేదట.
ఇంతకు ఈ ట్వీట్టర్ ఏం చేసిందంటే.
జమ్మూ కశ్మీర్, లడఖ్ ప్రాంతాలను ప్రత్యేక దేశంగా పేర్కొంటూ, భారతదేశ మ్యాప్ ను తప్పుగా చూపించిందట.
కాగా ఇదివరకే భారత కొత్త ఐటీ చట్టం అమలుకు మొండికేస్తున్న ట్విట్టర్ భారత ప్రభుత్వంతో సంబంధాలను దాదాపుగా తెంచుకునేలా ప్రవర్తిస్తుందట.కాగా తాజాగా ఈ ఘటన పై కేంద్రం ట్వీట్టర్ పై ఏ చర్యకు ఊపక్రమిస్తుందో చూడాలి.
ఇక ట్విట్టర్ చేసిన ఈ తప్పుకు నెటిజన్స్ అయితే తెగ కామెంట్స్ పెడుతూ ట్విట్టర్ తప్పును వేలెత్తి చూపిస్తున్నారట.ప్రస్తుతం కేంద్రం, ట్విట్టర్ మధ్య నెలకొన్న వివాదం పరిష్యరించబడితే గానీ ఇండియాలో ట్వీట్టర్ కు ఎలాంటి ఇబ్బందులు కలగవట లేదంటే చెప్పలేం ఏం జరుగుతుందో అని అంటున్నారట కొందరు.