తిరుమల: నేడు చక్రసాన్నంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని టిటిడి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ.
కరోనా కారణంగా బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించాల్సి వచ్చింది.ఏకాంతంగా నిర్వహించినప్పటికీ శాస్త్ర బద్దంగా ఘనంగా జరిపించాము.
ఎస్వీబిసీ, ఇతర ఛానల్స్ ద్వారా భక్తులు బ్రహ్మోత్సవాలను తిలకించారు.దేశవ్యాప్తంగా వున్న తెలుగు ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు.ఆన్ లైన్ లోనే కాకుండా తిరుపతి, కాలినడక మార్గంలో టికెట్లు కేటాయింపు పై త్వరలో నిర్ణయం తీసుకుంటాము.