భ‌క్తుల‌కు టీటీడీ విజ్ఞప్తి

వ‌రుస సెల‌వుల నేప‌థ్యంలో తిరుమ‌ల‌లో ర‌ద్దీ నెల‌కొనే అవ‌కాశం ఉంద‌ని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం అంచ‌నా వేస్తోంది.

ఆగ‌స్ట్ 11 నుంచి 15వ తేదీ వ‌ర‌కు సెల‌వుల కార‌ణంగా తిరుమ‌ల‌కు భక్తులు అధిక సంఖ్య‌లో త‌ర‌లి వ‌చ్చే అవ‌కాశం ఉంది.

ఈ నేప‌థ్యంలో ర‌ద్దీని దృష్టిలో ఉంచుకుని వృద్ధులు, చిన్నపిల్ల‌ల త‌ల్లిదండ్రులు, దివ్యాంగులు తిరుమల ప‌ర్య‌ట‌న‌ను వాయిదా వేసుకోవాల‌ని టీటీడీ విజ్ఞప్తి చేసింది.అదేవిధంగా సాధార‌ణ భ‌క్తులు ప్ర‌ణాళిక బ‌ద్ధంగా ముందుగానే ద‌ర్శ‌నం, వ‌స‌తి బుక్ చేసుకుని రావాల‌ని సూచించింది.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

తాజా వార్తలు