వెంకటేష్, రవితేజ సినిమాలపై త్రినాథరావు నక్కిన క్లారిటీ

మేం వయసుకి సినిమాతో దర్శకుడుగా పరిచయం అయ్యి తరువాత సినిమా చూపిస్తా మామా మూవీగా గ్రాండ్ సక్సెస్ కొట్టి అందరి దృష్టిని తన వైపుకి తిప్పుకున్న దర్శకుడు త్రినాధ్ రావు నక్కిన.

ఇక ఈ మూవీ తర్వాత నేచురల్ స్టార్ నానితో నేను లోకల్ అనే సినిమాతో మరో కమర్షియల్ హిట్ ని ఈ దర్శకుడు తన ఖాతాలో వేసుకున్నాడు.

వీటి తర్వాత హీరో రామ్ తో హలో గురు ప్రేమకోసమే అనే మూవీ తెరకెక్కించారు.ఈ మూవీ ఎవరేజ్ టాక్ సొంతం చేసుకుంది.

ఇక త్రినాధ్ రావు తెరకెక్కించిన ఈ మూడు సినిమాలకి ప్రసన్న కుమార్ కథ అందించిన సంగతి తెలిసిందే.వీరిద్దరు కలిసి విక్టరీ వెంకటేష్ కి కథ చెప్పి ఒకే చేయించుకున్నారు.

సురేష్ ప్రొడక్షన్ లో ఆ మూవీ తెరకేక్కుతుందని అందరూ భావించారు.అయితే ఈ మూవీ ఎందుకనో సెట్స్ పైకి వెళ్ళలేదు.

Advertisement

అలా అని క్యాన్సిల్ అయినట్లు కూడా ఎక్కడా ప్రకటించలేదు.అలాగే మాస్ మహారాజ్ రవితేజకి ఒక కథ చెప్పి ఒకే చేయించుకున్నారని టాక్ వచ్చింది.

ఈ మూవీని అఫీషియల్ గా నిర్మాతలు కూడా ఖరారు చేశారు.అయితే రవితేజ మాత్రం త్రినాధ్ రావుని పక్కన పెట్టి శరత్ మండవ దర్శకత్వంలో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళాడు.

ఈ నేపధ్యంలో త్రినాధ్ రావు ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిపోయిందనే ప్రచారం తెరపైకి వచ్చింది.ఈ నేపధ్యంలో తాజాగా దర్శకుడు ఈ పుకార్లకి క్లారిటీ ఇచ్చాడు.

మాస్ మహారాజ్ రవితేజతో చేయబోయే సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయ్యిందని చెప్పాడు.ఇక రవితేజ ఎప్పుడంటే అప్పుడు షూటింగ్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.అలాగే వెంకటేష్ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ అయ్యిందని తెలిపారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

రవితేజ మూవీ తర్వాత వెంకటేష్ తో చేయబోయే సినిమా స్టార్ట్ అవుతుందని స్పష్టం చేశాడు.

Advertisement

తాజా వార్తలు