కాకినాడ జిల్లా కోలంక గ్రామంలో విషాదం

కాకినాడ జిల్లా గాజులూరు మండలం కోలంక గ్రామంలో విషాదం నెలకొంది.కారు డోర్ లాక్ పడటంతో ఎనిమిదేళ్ల చిన్నారి మృత్యువాత పడింది.

కిరాణా షాపుకు వెళ్తూ కారులోకి ఎక్కింది.అనుకోకుండా డోర్ లాక్ పడటంతో అఖిలాండేశ్వరి అనే పాప కారులోనే ఉండిపోయింది.

ఈ క్రమంలో ఊపిరి ఆడక మరణించింది.చిన్నారి కోసం ఊరంతా గాలించిన కుటుంబ సభ్యులకు కారులో విగతజీవిగా కనిపించింది.

దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Advertisement
కాంగ్రెస్ సీనియర్ నేత డి. శ్రీనివాస్ మృతి

తాజా వార్తలు