టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రస్తుతం పాన్ ఇండియా హీరోలుగా సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు.కొంతమంది హీరోలకు ఇప్పటికే పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపు ఉండగా మరి కొందరు హీరోలకు పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపు రావాల్సి ఉంది.
అయితే కొంతమంది హీరోలు ప్రేక్షకులను మరింత ఆకట్టుకోవడం కొరకు సర్జరీలు చేయించుకోవడం ద్వారా తమ లుక్ ను మార్చుకున్నారు.
సింహాద్రి సినిమా సమయంలో బరువు పెరిగిన తారక్ రాఖీ సినిమా సమయానికి లుక్ పూర్తిగా మారిపోవడంతో విమర్శలు ఎదుర్కొన్నారు.
ఆ సమయంలో జక్కన్న సూచనల మేరకు లైపో చేయించుకున్న ఎన్టీఆర్ ఆ సమయంలో ఏకంగా 30 కేజీల బరువు తగ్గారు.ఎన్టీఆర్ సన్నబడిన తర్వాత కూడా లుక్ విషయంలో కొన్ని విమర్శలు రాగా అదుర్స్ సినిమా నుంచి కొత్త లుక్ తో తారక్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
మరో హీరో మంచు విష్ణు కూడా సలీం సినిమా సమయంలో బరువు తగ్గించుకోవడానికి సర్జరీ చేయించుకున్నారని సమాచారం.
ఆడియన్స్ ను ఆకట్టుకోవాలనే ఆలోచనతో విష్ణు లైపో చేయించుకున్నారని తెలుస్తోంది.సూపర్ స్టార్ మహేష్ బాబు వయస్సు పెరుగుతున్నా యంగ్ గా కనిపిస్తున్నారనే సంగతి తెలిసిందే.మహేష్ అందంగా కనిపించడానికి ఫేసింగ్ కు సర్జరీ చేయించుకున్నారని బోగట్టా.
చిరంజీవి, నాగ్ ముఖంపై ముడతలు రాకుండా యంగ్ గా కనిపించడానికి కొన్ని ఇంజక్షన్స్ ను వాడుతున్నారని తెలుస్తోంది.చరణ్, బన్నీ పెదవులకు సంబంధించిన సర్జరీలను చేయించుకుని ఈ జాబితాలోకి చేరారని సమాచారం.మరో స్టార్ హీరో రవితేజ కూడా ఈ తరహా సర్జరీని చేయించుకున్నారని సమాచారం అందుతోంది.సునీల్ కూడా బరువు తగ్గడానికి సర్జరీ చేయించుకున్నారని ఇండస్ట్రీలో ప్రచారం జరిగింది.
అయితే హీరోలు ఈ సర్జరీల గురించి స్పందించి వాస్తవాలు చెప్పే అవకాశాలు తక్కువేనని చెప్పవచ్చు.