తెలుగులో తళుక్కున మెరిసి తెరమరుగైన ఈ హీరోయిన్ గుర్తుందా..?

తెలుగులో ప్రముఖ దర్శకుడు మదన్ దర్శకత్వం వహించిన  "గుండె ఝల్లుమంది" అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన పంజాబీ బ్యూటీ "అదితి శర్మ" తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమే.

అయితే ఈ అమ్మడు వచ్చీ రావడం తోనే పర్వాలేదనిపించడంతో తమిళం, మలయాళం, కన్నడ, తదితర భాషలలో హీరోయిన్ గా నటించే అవకాశాలను దక్కించుకుంది.

కానీ అదితి శర్మ హీరోయిన్ గా నటించిన ఎక్కువ శాతం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో ఈ అమ్మడిని ఎవరు గుర్తించలేదు.అయితే సినిమా అవకాశాలు తగ్గిపోయిన సమయంలో బాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందినటువంటి  "సర్వర్ ఆహుజా"  అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.

ప్రస్తుతం అదితి శర్మ కి ఒక పాప కూడా ఉంది.దీంతో ప్రస్తుతం అదితి శర్మ ఒక పక్క తన భర్త వ్యాపార పనుల్లో సహాయం చేస్తూ మరో పక్క కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తోంది.

కాగా ఇటీవలే బాలీవుడ్ లో తనకి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం వచ్చినప్పటికీ అదితి శర్మ తన కుటుంబ బాధ్యతల కారణంగా సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం.అయితే ఈ విషయం ఇలా ఉండగా తెలుగులో చివరిగా అదితి శర్మ "బబ్లూ" అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది.

Advertisement

  ఈ చిత్రం కూడా దారుణంగా ఫ్లాప్ అయ్యింది. అదితి శర్మ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, పంజాబీ, తదితర భాషలలో కలిపి దాదాపుగా 12కి పైగా చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటించింది.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు