సినిమా ఇండస్ట్రీలో ఈ ఏడాది అంటే 2023లో ఎంతో మంది ప్రముఖులు, సినీ తారలు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.అయితే మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో 2023లో చనిపోయిన సెలబ్రిటీలు ఎవరెవరో ఇప్పుడు తెలుసుకుందాం.
తారకరత్న:
నందమూరి తారకరత్న(Nandamuri Tarakaratna) లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్రలో పాల్గొని గుండెపోటుతో హాస్పిటల్లో చేరి దాదాపు 23 రోజులపాటు చావు బతుకుల మధ్య ఉండి చివరికి ఫిబ్రవరి 18న కన్నుమూసారు.

జమున:
సావిత్రి కాలం నాటి హీరోయిన్ అయినా సీనియర్ నటి జమున (Jamuna) కూడా ఈ ఏడాది జనవరి 27న మరణించింది.ఈమె వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే అనారోగ్య కారణాలతో మరణించింది.

కె .విశ్వనాథ్ :
కళాతపస్వి కే విశ్వనాధ్ (K Vishwanath) గారు అనారోగ్య కారణాలతో ఫిబ్రవరి 2న మరణించారు.

మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ :
రాజ్ కోటి ద్వయం లో ఒకరిగా పేరు తెచ్చుకున్న మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ (Music Director Raj) అనారోగ్య కారణాలతో మే 21న మరణించారు.

రాకేష్ మాస్టర్:
డాన్స్ మాస్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించిన రాకేష్ మాస్టర్ (Rakesh Master) మద్యానికి బానిసవ్వడం వల్ల మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యి జూన్ 18న తుది శ్వాస విడిచారు.

చంద్రమోహన్ :
హృదయ సంబంధిత సమస్యతో బాధపడుతున్న చంద్ర మోహన్ (Chandra Mohan) నవంబర్ 11న కన్నుమూశారు.

శరత్ బాబు:
విలక్షణ నటుడిగా ఎన్నో మంచి మంచి పాత్రల్లో నటించి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించిన నటుడు శరత్ బాబు (Sharath Babu) మే 22న అనారోగ్య కారణాలతో మరణించారు.వీళ్లే కాకుండా ఇంకా చాలామంది సినీ ప్రముఖులు ఈ ఏడాది దివికెగిసారు.







