కరోనా ఈ పేరు వింటే ఇప్పటికి ఉలిక్కి పడేవారు ఉన్నారు.ఎప్పుడైతే దేశం దాటి వ్యాపించడం మొదలు పెట్టిందో దీని దండయాత్రకి యావత్ ప్రపంచం మొత్తం గడగడ వణికిపోయింది.
ఎందరో కుటుంబాలను చీకట్లోకి తోసేసింది.ఎన్నో తాళిబొట్లు వెంట తీసుకెళ్ళింది.
కుటుంబాలకు కుటుంబాలే దీని బారినపడి దిక్కులేని అనాధలు అయ్యారు.అయితే ఇంతటి విపత్తుకు కారణం అయిన చైనా మాత్రం ఈ తప్పిదం తనది కాదని బుకాయించింది.
2017లోనే దీనిని గుర్తించిన విషయం దాచిన చైనా సమస్త ప్రజల జీవితాలను సర్వనాశనం చేసింది.ఈ క్రమంలో ఇదెలా పుట్టిందని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్న నేపధ్యంలో ఈ రక్కసికి పుట్టినిల్లు చైనాయేనని నిర్ధారించేందుకు మరింత బలమైన ఆధారం లభ్యమైంది.
చైనాలోని వుహాన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన పరిశోధకులు కొందరు ఓ గుహలో కరోనా సోకిన గబ్బిలాల నుంచి శాంపిల్స్ సేకరిస్తుండగా, అవి వారిని కరిచాయట.చేతికి రబ్బరు తొడుగులు ధరించినప్పటికీ ఓ గబ్బిలం కోర చేతికి గుచ్చుకుందని ఓ పరిశోధకుడు వెల్లడించాడట.
అంతే కాదు ఈ పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్తలు తమను కరోనా సోకిన గబ్బిలాలు కరిచినట్టు అంగీకరించారట.ఇంతటి కఠోరమైన నిజం బయటకు వచ్చిన సందర్భంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఎలా స్పందిస్తుందో మరి చూడాలి.