శరీరంలో మలినాలను ఎప్పటికప్పుడు తొలగించుకోవాలన్న సంగతి తెలిసిందే.లేదంటే అంతర్గత అవయవాల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బ తింటుంది.
ఫలితంగా వివిధ రకాల జబ్బులను ఫేస్ చేయాల్సి ఉంటుంది.అందుకే బాడీని తరచూ డిటాక్స్ చేసుకోవాలి.
అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే సూపర్ డ్రింక్ అద్భుతంగా సహాయపడుతుంది.ప్రస్తుత వేసవి కాలంలో ఈ డ్రింక్ను తీసుకుంటే మలినాలు తొలగిపోవడమే కాదు బాడీ కూల్గా కూడా మారుతుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం ఈ సూపర్ డ్రింక్ ఏంటో, ఎలా తయారు చేసుకోవాలో.తెలుసుకుందాం పదండీ.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో వన్ టేబుల్ స్పూన్ సోంపు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, చిన్న దాల్చిన చెక్క ముక్క, కొన్ని కొత్తిమీర ఆకులు వేసి మరిగించాలి.
నీరు సగం అయ్యే వరకు హీట్ చేసి.స్టైనర్ సాయంతో వాటర్ను ఫిల్టర్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ వాటర్లో వన్ టేబుల్ స్పూన్ తేనెను యాడ్ చేస్తే డిటాక్స్ డ్రింక్ సిద్ధమైనట్లే.
ప్రతి రోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ డ్రింక్ను తాగిస్తే.శరీరంలో పేరుకుపోయిన మలనాలన్నీ బయటకు వెళ్లిపోతాయి.అలాగే ప్రస్తుత కాలంలో చాలా మంది వేసవి వేడిని తట్టుకోలేక తీవ్రంగా సతమతం అయిపోతుంటారు.
అయితే పైన చెప్పిన డిటాక్స్ డ్రింక్ తీసుకుంటే.సోంపు గింజల్లో ఉండే ప్రత్యేక సుగుణాలు అధిక వేడిని తగ్గించి శరీరాన్ని కూల్గా మారుస్తాయి.
అంతేకాదు, ఈ డ్రింక్ను డైట్లో చేర్చుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ పని తీరు మెరుగు పడుతుంది.గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.
రోగ నిరోధక వ్యవస్థ స్ట్రోంగ్గా మారుతుంది.రక్తంలో చెడ్ కొలెస్ట్రాల్ ఉంటే కరిగిపోయి గుండె ఆరోగ్య వంతంగా మారుతుంది.